చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో మంగళవారం ఉదయం భూమి కంపించింది.
బీజింగ్:- చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో మంగళవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా ఉందని భూ పరిశోధన శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ విపత్తులో 12 మంది మృత్యువాతపడగా 134 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనా ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రెస్య్కూ టీం, పోలీసులు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో 30 సార్లు భూమి కంపించిందని స్థానికులు వాపోతున్నారు. స్థానిక మీడియా మాత్రం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు...
Comments
Post a Comment