బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడిని ఎట్టకేలకు రక్షించాయి సహాయక బృందాలు.

పంజాబ్​లో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడిని ఎట్టకేలకు రక్షించాయి సహాయక బృందాలు.

దాదాపు 110 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి చిన్నారిని మృత్యు ఒడి నుంచి కాపాడాయి.

పంజాబ్​ సంగ్రూర్​ జిల్లా భగవాన్​పురలో రెండేళ్ల బాలుడు మృత్యువును జయించాడు.

ఈ నెల 6న బోరుబావిలో పడిన చిన్నారి ఫతేవీర్​ను సహాయక బృందాలు ఎట్టకేలకు రక్షించాయి.

దాదాపు 5 రోజులపాటు నిర్విరామంగా శ్రమించి బాలుడిని మృత్యుఒడి నుంచి కాపాడాయి.

బోరుబావి నుంచి బయటకు తీసిన అనంతరం బాలుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు సిబ్బంది.

తన పుట్టిన రోజైన ఈ నెల 6న ఇంట్లో ఆడుకుంటూ పక్కనే ఉన్న బోరుబావిలో పడ్డాడు ఫతేవీర్​.

అప్పటి నుంచి ఆ చిన్నారిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం, పాటియాల సాయుధ ఇంజినీర్ల రక్షణ దళాలు సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?