వైకాపా పార్లమెంటరీ భేటీ ప్రారంభం
దిల్లీ: వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్ నేతృత్వంలో దిల్లీలోని ఏపీ భవన్లో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, రాష్ట్ర సమస్యలను సామరస్యపూర్వకంగా కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై చర్చిస్తున్నారు.
వైకాపా తరఫున ఎన్నికైన ఎంపీల్లో ఎక్కువ మంది కొత్త వారు కావడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సభలో ఏవిధంగా లేవనెత్తాలన్న అంశంపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డితో పాటు పార్టీ ఎంపీలంతా సమావేశానికి హాజరయ్యారు.
Comments
Post a Comment