ఇవాళ రెండో రోజు ఏపీ అసెంబ్లి సమావేశాలు జరగనున్నాయి.
అమరావతి :
ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది.
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శాసన సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు.
ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది.
స్పీకర్ ఎన్నిక అనంతరం సభ వాయిదా పడనుంది.
తొలి రోజు శాసనసభలో సీఎం, విపక్ష నేతతో పాటు ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, శాసన సభ సభ్యులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.
ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు వీరితో ప్రమాణం చేయించారు.
Comments
Post a Comment