జగన్ కృషిని అభినందిస్తున్నాం : యార్లగడ్డ

విశాఖపట్నం: తెలుగు భాష అభివృద్ధికి జగన్ కృషిని అభినందిస్తున్నామని యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అన్నారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో తెలుగు తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో తెలుగు భాష అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు.

తెలుగు వర్సిటీ, తెలుగు అకాడమీ విభజనను వేగవంతం చేయాలని యార్లగడ్డ పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?