నవరత్నాలను పేదలకు అందించేందుకు బూత్ కమిటీ సభ్యులు సిద్దంగా ఉండాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత‌్తా చాటాలి

మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు

కొండపల్లి గ్రామానికి చెందిన బూత్ కమిటీ కన్వీనర్ లు సభ్యులతో మంగళవారం సమావేశం జరిగింది

సమావేశం లో  వసంత కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ ,,,,

జగన్మోహనరెడ్డి గారు ప్రవేశపెట్టిన  నవరత్నాలను పేదలకు అందించేందుకు బూత్ కమిటీ సభ్యులు వారదిలా పని చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు

ఎమ్మెల్యేగా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు

ఇదే స్పూర్తి తో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని పిలుపునిచ్చారు

అభ్యర్థులఎంపిక పక్రియ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు గ్రామ పార్టీ నాయకులు పైనే అదారపడి ఉందన్నారు

పార్టీ కోసం పనిచేసే వారికి వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని డబ్బు సంచులతో వచ్చే వారికి అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు

స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పార్టీ విజయం కోసం పని చేయడానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు

బూత్ కమిటీ కన్వీనర్ లకు పలు అంశాలపై జగన్మోహనరెడ్డి గారి విజన్ గురించి అవనీతీ లేని పారదర్శకమైన పాలన కోసం పనిచేయాలని సూచించారు

ఈ కార్యక్రమంలో కొండపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూత్ కమిటీ కన్వీనర్ లు సభ్యులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?