తెలుగు రాజకీయాల్లో, టీడీపీ చరిత్రలో సంచలన అధ్యాయం వైశ్రాయ్ ఘటన
తెలుగు రాజకీయాల్లో, టీడీపీ చరిత్రలో సంచలన అధ్యాయం వైశ్రాయ్ ఘటన. ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా పదవి నుంచి దించి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నారు. ఈ ఘటనపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్ స్పందించారు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన భార్య చనిపోయారు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన్ను దగ్గరుండి చూసుకునే మనిషి లేకుండా పోయారు. పిల్లలంతా అప్పుడప్పుడు వచ్చి కలిసేవారు. ఆ సమయంలోనే లక్ష్మిపార్వతి ఆయనకు దగ్గరైంది. వైశ్రాయ్ ఘటనకు ఆమె కారణం అన్నారు.
Comments
Post a Comment